ఈ సాయంత్రం ఢిల్లీలో సీఈసీ, హోం శాఖ కార్యదర్శిలను కలవనున్న టీడీపీ నేతలు
- తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో ఉద్రిక్తతలు
- రాళ్ల దాడి అంశంపై టీడీపీ నేతల ఆగ్రహం
- ఢిల్లీ వరకు తీసుకెళ్లాలని నిర్ణయం
- ఈ సాయంత్రం కీలక భేటీలు
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగిందన్న విషయంపై ఫిర్యాదు చేయనున్నారు. కేంద్ర బలగాలతో తిరుపతి ఉప ఎన్నిక నిర్వహించాలని కోరనున్నారు. చంద్రబాబుకు రక్షణ కల్పించడంలో డీజీపీ విఫలం అయ్యాడని, పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు.