Telangana: తెలంగాణ కరోనా అప్ డేట్స్.. జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కేసులు!

Telangana registers 2251 new Corona cases
  • గత 24 గంటల్లో 2,251 కొత్త కేసులు
  • కరోనాతో ఆరుగురి మృతి
  • జీహెచ్ఎంసీలో 355 కేసుల నమోదు
కరోనా సెకండ్ వేవ్ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 2,251 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఈమేరకు వివరాలను వెల్లడించింది. ఇదే సమయంలో 565 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

ఇక 24 గంటల్లో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 355 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా (258), నిజామాబాద్ జిల్లా (244) ఉన్నాయి. ములుగు జిల్లాలో అత్యల్పంగా 7 కేసులు నిర్ధారణ అయ్యాయి.

తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసులు 3,29,529కి చేరుకోగా... 3,05,900 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 1,765 మంది మృతి చెందారు. రాష్ట్రంలో రికవరీ రేటు 92.82 శాతంగా ఉంది. దేశ రికవరీ రేటు 89.9 శాతం కావడం గమనార్హం.

తెలంగాణలో గత 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలు (జిల్లాల వారీగా):
Telangana
Corona Virus
Updates
GHMC

More Telugu News