ఎన్నికలు అయిపోయాయి... ఇక వ్యాక్సినేషన్ ముమ్మరం చేయండి: సీఎం జగన్
- ఏపీలో ముగిసిన స్థానిక ఎన్నికలు
- కరోనా పరిస్థితులపై దృష్టి సారించిన సీఎం జగన్
- ఈ నెల 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్
- రోజుకు 6 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశం
ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు కేంద్రం ఆదేశాలతో టీకా ఉత్సవ్ చేపట్టాలని, రోజుకు 6 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. టీకా ఉత్సవ్ జరిగే 4 రోజుల్లో 24 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు అందించాలని ఆదేశించారు. టీకా ఉత్సవ్ ముగిశాక వ్యాక్సిన్ డోసుల కొరత ఏర్పడితే కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని సూచించారు.