ఎట్టకేలకు అజ్ఞాతం వీడిన రాసలీలల సీడీ కేసు యువతి.. బెంగళూరు కోర్టుకు హాజరు
- 28 రోజుల అనంతరం అజ్ఞాతం వీడిన యువతి
- రెండు గంటలపాటు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం
- కోర్టు అనుమతితో రాత్రి వరకు సిట్ విచారణ
- నేడు మళ్లీ హాజరు కావాలని ఆదేశం
నిన్న మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో కోర్టుకు చేరుకున్న యువతి దాదాపు రెండు గంటలపాటు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. ఆ సమయంలో అక్కడ ఓ స్టెనోగ్రాఫర్ మాత్రమే ఉండగా, ఈ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో ఆమెను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు రాత్రి వరకు విచారించారు. అనంతరం నేడు కూడా విచారణకు రావాలని ఆదేశించారు.