తెలంగాణలో లాక్ డౌన్ అంటూ వస్తున్న వార్తలపై స్పష్టతనిచ్చిన సీఎం కేసీఆర్
- మళ్లీ కోరలు చాస్తున్న కరోనా రక్కసి
- పెరుగుతున్న కొత్త కేసుల సంఖ్య
- తెలంగాణలో విద్యాసంస్థల మూసివేత
- లాక్ డౌన్ ప్రకటిస్తారంటూ ప్రచారం
- కేసీఆర్ ను కలిసిన సినీ పెద్దలు
- లాక్ డౌన్ ఉండదని స్పష్టం చేసిన సీఎం
"కొందరు సినీ ప్రముఖులు నన్ను కలిశారు. ఇప్పటికే పలు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయని, పెట్టుబడులు పెట్టామని ఆ సినీ ప్రముఖులు వివరించారు. గతంలో విధించిన లాక్ డౌన్ తో బాగా నష్టపోయాం... మరోసారి లాక్ డౌన్ దిశగా చర్యలు లేవని వారికి స్పష్టం చేశాను. అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగానే విద్యాసంస్థలను మూసివేశాం. విద్యాసంస్థలను మూసివేయాల్సి రావడం బాధ కలిగిస్తున్నా, తప్పలేదు" అని పేర్కొన్నారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.