చమురుపై ఆదాయం... పెరిగిందిలా...!
- లోక్ సభలో వివరణ ఇచ్చిన కేంద్రం
- పెట్రోల్, డీజిల్ పై పన్నుల రూపేణా భారీ ఆదాయం
- భారీగా పెరిగిన సుంకాలు
- ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2.94 లక్షల కోట్లు
2014లో పెట్రోల్ ఒక లీటరుపై ఎక్సైజ్ సుంకం రూ.9.48 ఉండగా, ఇప్పుడది రూ.32.90కి చేరిందని వివరించారు. అదే సమయంలో డీజిల్ ఒక లీటరుపై రూ.3.56గా ఉన్న సుంకం నేడు రూ.31.80కి పెరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి లభించే మొత్తం ఆదాయంలో చమురు, గ్యాస్ పై లభించే ఆదాయం 2014-15లొ 5.4 శాతం ఉంటే 2020-21 నాటికి 12.2 శాతానికి చేరిందని పేర్కొన్నారు.