తెలంగాణలోని ముస్లింల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన షర్మిల
- ముస్లింలతో సమావేశమైన షర్మిల
- ముస్లింలను ప్రభుత్వం ఓటు బ్యాంకుగా చూస్తోందని మండిపాటు
- మనం చేతులు కలిపితే రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకురావచ్చని వ్యాఖ్య
ముస్లింలను తెలంగాణ ప్రభుత్వం ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని... వారికి 12 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని హామీ ఇచ్చి, మోసం చేశారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలను హేట్ బ్యాంక్ గా వాడుకుంటోందని విమర్శించారు. మనందరం చేతులు కలిపితే తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకురావచ్చని చెప్పారు.