ఖమ్మం-వరంగల్-నల్గొండ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక.. దూసుకెళ్తున్న పల్లా
- తొలి రౌండ్ ఫలితాల వెల్లడి
- రెండు, మూడు స్థానాల్లో తీన్మార్ మల్లన్న, కోదండరాం
- కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
తొలి రౌండ్ ఫలితాలు విడుదలైన తర్వాత 16,130 ఓట్లతో పల్లా రాజేశ్వర్రెడ్డి తన సమీప ప్రత్యర్థుల కంటే ముందున్నారు. 12,046 ఓట్లతో తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో ఉండగా, టీజేఎస్ నేత కోదండరాం 9,080 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డి (6,615), కాంగ్రెస్ నేత రాములు నాయక్ (4,354), రాణి రుద్రమరెడ్డి (1,123), చెరుకు సుధాకర్ (1,077) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.