ఏపీలో కొనసాగుతున్న మునిసిపల్ ఎన్నికల పోలింగ్.. విజయవాడలో ఓటేసిన పవన్
- పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు
- పటమటలంకలో ఓటు వేసిన పవన్
- బరిలో మొత్తం 7,549 మంది అభ్యర్థులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటమట లంకలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్ నంబరు 4లో పవన్ ఓటు వేశారు. అలాగే, ఎమ్మెల్సీ అశోక్బాబు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.