తమ పోలీసులు కాల్చిచంపిన భారతీయుడి మృతదేహాన్ని భారత్ కు అప్పగించిన నేపాల్!
- గత గురువారం నాడు సరిహద్దుల్లో కాల్పులు
- చర్చల అనంతరం మృతదేహాన్ని అప్పగించిన నేపాల్
- అంత్యక్రియలు ముగిశాయన్న జిల్లా ఎస్పీ
కాగా, గోవిందా సింగ్, తమ దేశంలోకి స్మగ్లింగ్ నిమిత్తం వస్తుంటే గుర్తించామని నేపాల్ పోలీసులు అంటుండగా, ఘటనను దగ్గరి నుంచి చూసిన స్థానికులు మాత్రం, నేపాల్ సైనికులతో వాగ్వాదానికి దిగడమే కాల్పులకు కారణమైందని అంటున్నారు. ఇదే ఘటనలో గాయపడిన గుర్మేజ్ సింగ్ అనే మరో యువకుడిని మెరుగైన చికిత్స నిమిత్తం లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీకి తరలించారు. ఆ సమయంలో అక్కడే ఉండి తప్పించుకున్న రేషమ్, పప్పూ సింగ్ లను పిలిబిత్ పోలీసులు విచారించి, నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.