ఇప్పటిదాకా 1.37 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం... విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి: మంత్రి పువ్వాడ
- ఎన్నికల హామీలపై కేసీఆర్ మోసం చేశాడంటున్న విపక్షాలు
- ఉద్యోగాలు భర్తీ చేయడంలేదని ఆరోపణ
- విపక్షాల ఆరోపణలను ఖండించిన మంత్రి పువ్వాడ
- తమ సవాల్ కు విపక్షాలు స్పందించడంలేదని వ్యాఖ్య
- కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే మోసం చేసిందన్న మంత్రి
ఉద్యోగ నియామకాలపై తాము సవాల్ విసిరినప్పటికీ విపక్షాలు స్పందించడంలేదని తెలిపారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ కేంద్ర ప్రభుత్వమే మోసం చేస్తోందని, ఈ ఆరేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీజేపీ నేతలు చెప్పాలని మంత్రి పువ్వాడ నిలదీశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపైనా విమర్శలు చేశారు. అసలు, దేశంలో నిరుద్యోగం ప్రబలడానికి కారణం కాంగ్రెస్సేనని ఆరోపించారు.