వృద్ధి బాటన భారత్ పరుగులు: బ్లూమ్ బర్గ్!

Bloomberg High Expectations on Indias Growth
  • తిరోగమనం పోయి వృద్ధి పథం
  • సర్వీసెస్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో వృద్ధి
  • 13 శాతానికి పైగా జీడీపీ వృద్ధి అంచనా
భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ముగిసినట్టేనని, తిరోగమనం పోయి, వృద్ధి పథం ప్రారంభమైందని బ్లూమ్ బర్గ్ పేర్కొంది. తన తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించిన సంస్థ, ఇండియాలోని ఎనిమిది కీలక ఆర్థిక సూచీల్లో ఇప్పటికే రెండు సూచీలు పునరుజ్జీవ పథంలోకి వచ్చేశాయని వెల్లడించింది. సర్వీస్ సెక్టార్ తో పాటు మాన్యుఫాక్చరింగ్ రంగంలోనూ వృద్ధి నమోదైందని, ఈ రెండు అత్యంత శక్తిమంతంగా మారాయని వెల్లడించింది.

రానున్న నూతన ఆర్థిక సంవత్సరంలో ఇండియా వృద్ధి రేటులోకి తిరిగి రానుందని అభిప్రాయపడిన బ్లూమ్ బర్గ్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా భారత్ నిలుస్తుందని అంచనా వేసింది. ఇదిలావుండగా, 2021-22 ఫైనాన్షియల్ సంవత్సరంలో ఇండియా 13.7 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేయవచ్చని ఇప్పటికే మరో రీసెర్చ్ సేవల సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ అంచనా వేసిన సంగతి తెలిసిందే.

Go Back to Shorts
India
GDP
Corona Virus
Moodies
Bloomberg

More Telugu News