మహారాష్ట్ర కేబినెట్లో కరోనా కలకలం... ఇప్పటివరకు ఈ నెలలో ఏడుగురు మంత్రులకు పాజిటివ్
- ఒకే నెలలో కరోనా బారినపడిన మహా మంత్రులు
- తాజాగా ఛగన్ భుజ్ బల్ కు పాజిటివ్
- తనను కలిసినవాళ్లు టెస్టు చేయించుకోవాలని భుజ్ బల్ సూచన
- తన ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడి
ఈ ఫిబ్రవరి నెలలో మహారాష్ట్ర మంత్రివర్గంలో కరోనా పాజిటివ్ గా తేలిన మంత్రుల్లో ఛగన్ భుజ్ బుల్ ఏడోవారు. 2020లోనూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సహా 12 మంది మంత్రులు కరోనా ప్రభావానికి గురయ్యారు. కాగా, తనకు కరోనా సోకడంపై ఛగన్ భుజ్ బల్ స్పందించారు. గత మూడ్రోజుల వ్యవధిలో తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు.