: వడదెబ్బ మరణాలపై సీఎం సీరియస్

రాష్ట్ర రాజధానిలోని పలు ఆస్పత్రులలో సరైన వైద్యం అందక వడదెబ్బ బాధితులు మరణిస్తున్న వైనంపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. ముఖ్యంగా చిన్నారులకు నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన వారందరికీ ప్రవేశం లభించడం లేదంటూ వస్తున్న వార్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రులలో ఏర్పాట్లను పరిశీలించి తక్షణం నివేదిక ఇవ్వాలని వైద్యారోగ్య కార్యదర్శి అజయ్ సహానీని కోరారు. అలాగే వడదెబ్బ బాధితులకు ఆస్సత్రులలో తక్షణం చికిత్స లభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

More Telugu News