ఎన్నికల నేపథ్యంలో ఆయా ప్రాంతాలపై నిఘా ఉంటుంది: నిమ్మగడ్డ
- ఓటర్లు ఉత్సాహంతో ఓట్లు వేశారు
- ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని ఇనుమడింపజేశారు
- కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పని చేస్తున్నారు
ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పని చేశారని తెలిపారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా అధికారులు చేసిన ఏర్పాట్లు, తీసుకున్న భద్రతా చర్యలపై ఆయన ప్రశంసలు కురిపించారు. త్వరలో జరగనున్న మూడో విడత ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలపై నిఘాను పెడతామని తెలిపారు. మిగతా దశల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.