శశికళ వచ్చినా మాకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు: బీజేపీ జాతీయ కార్యదర్శి రాజా
- అన్నాడీఎంకే పార్టీకి, ప్రభుత్వానికి శశికళతో ఇబ్బంది లేదు
- ఈ పదేళ్లలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించింది
- మోదీ చొరవతో రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలు
మరోవైపు, ఆమె రాకతో అధికార అన్నాడీఎంకేకు కానీ, ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా పేర్కొన్నారు. నిన్న ఆయన విల్లుపురంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వ చొరవ కారణంగా తమిళ ప్రభుత్వానికి మరిన్ని సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పదేళ్లలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించిందని రాజా వివరించారు.