తప్పు జరుగుతోందని తెలిసినా, ఆరేళ్లు మౌనంగా ఉండిపోయా: ఖుష్బూ
- నేనిప్పుడు ప్రజల మధ్య ఉన్నాను
- తప్పు చేస్తే సొంత పార్టీనైనా నిలదీస్తా
- తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుష్బూ
ప్రస్తుతం దేశమంతా మోదీ హవా కొనసాగుతోందని అన్నారు. తమిళనాడులో బీజేపీ లేదని, చెన్నై దాటితే ఆ పేరు వినిపించదంటున్న మాటలో నిజం లేదని అన్నారు. ఇటీవల బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన వేల్ రథయాత్ర రాష్ట్రంలో ఎంత విజయవంతం అయిందో అందరూ చూశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ విషయం అందరికీ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. కాగా, ఖుష్బూ చెన్నై నగరంలోని ట్రిప్లికేన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.