Chennai Test: ముగిసిన మూడో రోజు ఆట... ఇంకా 321 పరుగులు వెనుకబడి ఉన్న టీమిండియా

End of third day play in Chennai test
  • తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 257 పరుగులు చేసిన భారత్
  • పంత్ 91, పుజారా 73 రన్స్
  • డామ్ బెస్ కు 4 వికెట్లు
  • తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 578 ఆలౌట్

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట చివరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ 33 పరుగులతోనూ, రవిచంద్రన్ అశ్విన్ 8 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 578 పరుగులు చేయగా, ఇంగ్లండ్ స్కోరుకు భారత్ ఇంకా 321 పరుగులు వెనుకబడి ఉంది.

అంతకుముందు, ధాటిగా ఆడిన రిషబ్ పంత్ 91 పరుగులు చేసి సెంచరీకి 9 పరుగుల దూరంలో అవుటయ్యాడు. పంత్ కు విశేష సహకారం అందించిన పుజారా 73 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. పంత్, పుజారాలను ఆఫ్ స్పిన్నర్ డామ్ బెస్ అవుట్ చేశాడు. బెస్ మొత్తమ్మీద 4 వికెట్లు చేజిక్కించుకున్నాడు. ఆట ఆరంభంలో ఆర్చర్ రెండు వికెట్లు తీశాడు.

  • Loading...

More Telugu News