ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 11%: ఆర్థిక సర్వేలో అంచనా
- V ఆకార అభివృద్ధి నమోదవుతుందన్న అంచనాలు
- కరోనా టీకా పంపిణీతో గాడిలో ఆర్థిక రంగం
- ద్రవ్యోల్బణం 15.4%గా రికార్డ్
- స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇదే అత్యధికం
లక్షా 53 వేల 847 మందిని బలిగొన్న కరోనాకు వ్యాక్సిన్ ను తీసుకురావడం, ఇప్పటికే చాలా మందికి టీకాను వేయడం వంటివి.. దేశ ఆర్థిక పునరుత్తేజానికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 1991లో ఆర్థిక వ్యవస్థను లిబరలైజ్ చేసిన తర్వాత.. ఇన్నేళ్లకు ఆర్థిక వృద్ధి ఘనంగా నమోదవుతుందని పేర్కొన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
అయితే, జీడీపీ మాత్రం ఓ మోస్తరుగా ఉంటుందని సర్వేలో వెల్లడించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో ద్రవ్యోల్బణం 15.4 శాతం పెరుగుతుందని చెప్పినట్టుగా సమాచారం. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇదే అత్యధిక ద్రవ్యోల్బణమని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం ‘V ఆకార (వేగంగా పడి, వేగంగా లేచిన)’ అభివృద్ధిని అంచనా వేసిందని చెబుతున్నారు.