ఒంటిమామిడి మార్కెట్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కేసీఆర్.. రైతులతో మాటామంతి!
- మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేయాలని రైతులకు సూచన
- రైతుల నుంచి 4 శాతానికి మించి కమిషన్ తీసుకోవద్దని ఏజెంట్లకు ఆదేశం
- కోల్డ్ స్టోరేజీలు, మౌలిక సదుపాయాల కల్పనకు 50 ఎకరాలు
కోల్ట్ స్టోరేజీల నిర్మాణంతోపాటు ప్రాథమిక సదుపాయాల కల్పన కోసం 50 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే, భవిష్యత్ అవసరాల కోసం ఒంటిమామిడి మార్కెట్ యార్డును మరో 14 ఎకరాల మేర విస్తరిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలకు ఒంటిమామిడి మార్కెట్ నుంచి కూరగాయలు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ అధికారులను కేసీఆర్ ఆదేశించారు.