కశ్మీర్ లో కూలిన ఆర్మీ హెలికాప్టర్!

  • పంజాబ్ నుంచి బయలుదేరిన ధ్రువ్
  • కథువా సమీపంలో క్రాష్ ల్యాండింగ్
  • పైలట్ దుర్మరణం
జమ్మూకశ్మీర్ లోని కథువా జిల్లాలో భారత సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్ కూలిపోగా, దాన్ని నడుపుతున్న పైలట్ దుర్మరణం పాలయ్యాడు. ఈ చాపర్ అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్ 'ధ్రువ' వేరియంట్ కు చెందినదని అధికారులు వెల్లడించారు. ఇది పంజాబ్ లోని పఠాన్ కోట్ నుంచి బయలుదేరిందని, కథువాకు సమీపంలోని లఖన్ పూర్ లో క్రాష్ ల్యాండింగ్ అయిందని తెలిపారు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో పైలట్ ను స్థానిక సైనిక ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చామని సీనియర్ పోలీస్ ఆఫీసర్ శైలేంద్ర మిశ్రా వెల్లడించారు. ప్రమాదం ఎందుకు జరిగిందన్న విషయమై విచారణ జరుగుతోందని తెలిపారు.


More Telugu News

Dhruva Army Helecopter Jammu And Kashmir