మరో ఏడు రాష్ట్రాలకు భారత్ బయోటెక్ కొవాగ్జిన్
- వచ్చే వారం నుంచి పంపిణీ చేస్తామన్న కేంద్రం
- వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ కేసులు 123 అని వెల్లడి
- అందులో ఆరుగురు చనిపోయారన్న ఆరోగ్యశాఖ
- వారి మరణానికి వ్యాక్సిన్ కారణం కాదని స్పష్టీకరణ
ఇప్పటిదాకా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చిన ఘటనలు 123 నమోదు కాగా.. శనివారం ఒక్కటి కూడా రాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం సైడ్ ఎఫెక్ట్స్ ఘటనల్లో 11 మందికి మాత్రమే పరిస్థితి విషమించిందని, ఆరుగురు చనిపోయారని వెల్లడించింది.
అయితే, వారి మరణానికి కరోనా వ్యాక్సిన్లు కారణం కాదని పోస్ట్ మార్టం ద్వారా తేలిందని వివరించింది. గుర్గావ్ కు చెందిన 56 ఏళ్ల మహిళకు పోస్ట్ మార్టం చేయగా.. గుండె–ఊపిరితిత్తుల వ్యాధి వల్లే చనిపోయినట్టు తేలిందని పేర్కొంది.