మమతా బెనర్జీ నోట నాలుగు రాజధానుల మాట!
- నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి
- కోల్ కతాలో జరిగిన కార్యక్రమంలో మమత ఆసక్తికర వ్యాఖ్యలు
- భారత్ కు నాలుగు రాజధానులు ఉండాలని వెల్లడి
- రొటేషన్ పద్ధతిలో రాజధానులు ఉండాలని వివరణ
ఈ సందర్భంగా ఆమె బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. నేతాజీ ఎన్నికలప్పుడే గుర్తొస్తాడా అని నిలదీశారు. నేతాజీ జయంతిని పరాక్రమ్ దివస్ అంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రవీంద్రనాథ్ ఠాగూర్ నాడు నేతాజీని దేశనాయక్ అని సంబోధించారని, అందుకే తాము ఆయన జయంతిని దేశనాయక్ దివస్ గానే జరుపుకుంటామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. నేతాజీ జయంతి సందర్భంగా జాతీయ సెలవుదినం ప్రకటన ఎందుకు చేయడంలేదని అడిగారు.