India: కరోనా వల్ల భారత్ లో గత 24 గంటల్లో 152 మంది మృతి

India registers 14256 new corona cases in 24 hours
  • 24 గంటల్లో 14,256 కరోనా కేసులు 
  • ప్రస్తుతం దేశంలో 1,85,662 యాక్టివ్ కేసులు
  • ఇప్పటి వరకు 13,90,592 మందికి వ్యాక్సిన్
మన దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 14,256 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మహమ్మారి కారణంగా 152 మంది ప్రాణాలు కోల్పోయారు. 17,130 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,06,39,684కి చేరుకుంది. మొత్తం 1,53,184 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,03,00,838 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,85,662 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు 13,90,592 మందికి వ్యాక్సిన్ వేశారు. అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
India
Corona Virus
Updates

More Telugu News