అనూహ్యంగా సైబరాబాద్ పోలీసులకు చిక్కిన హోసూరు ముత్తూట్ బ్యాంకు దోపిడీ ముఠా
- నిన్న ఉదయం బ్యాంకు తెరవగానే లూటీ
- తుపాకితో బెదిరించి రూ. 7 కోట్ల విలువైన బంగారం దోపిడీ
- నిందితుల నుంచి బంగారం, నగదు స్వాధీనం
సమాచారం అందుకున్న పోలీసులు దుండగులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు కర్ణాటకకు పారిపోయి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు మూడు బృందాలను బెంగళూరుకు పంపారు. వారి కోసం గాలిస్తున్న సమయంలోనే ఈ ఉదయం సైబరాబాద్ పోలీసులకు ఈ ముఠా చిక్కింది. నిందితుల నుంచి బంగారు ఆభరాణలు, నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.