హోసూరు ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దొంగల ముఠా హల్చల్.. పట్టపగలే 25 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన వైనం!
- మాస్కులు, హెల్మెట్లు ధరించిన దుండగులు
- దోచుకున్న బంగారం విలువ ఏడున్నర కోట్లు
- నిందితుల కోసం 10 ప్రత్యేక బృందాలతో గాలింపు
లోపలికి వచ్చిన దుండగులు తొలుత సెక్యూరిటీ గార్డుపై దాడిచేశారు. ఆ తర్వాత మేనేజర్, నలుగురు సిబ్బందిని తుపాకితో బెదిరించి రూ. 7.5 కోట్ల విలువైన 25 కేజీలకు పైగా బంగారం, లాకర్లలో ఉన్న 96 వేల నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు దుండగులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు కర్ణాటకకు పారిపోయి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు మూడు బృందాలను బెంగళూరుకు పంపారు.