ఆరోగ్య సిబ్బందికి స్వయంగా కరోనా టీకా వేసిన వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
- ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ షురూ
- తన నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ ను పర్యవేక్షించిన శ్రీదేవి
- పొన్నెకల్లు, నుదురుపాడులో ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేసిన వైనం
- ఓ డాక్టర్ గా సంతోషిస్తున్నానని వెల్లడి
ఇక టీకాలు వేయడం పట్ల ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందిస్తూ, తొలిదశలో ఆరోగ్య సిబ్బందికి తన చేతుల మీదుగా వ్యాక్సిన్ వేయడం ఎంతో ఆనందం కలిగిస్తోందని అన్నారు. అందరికీ ఈ అవకాశం రాదని, ఓ డాక్టర్ గా ఎంతో సంతోషిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ప్రాణాపాయం ఉండదని వెల్లడించారు. లేనిపోని అపోహలు వద్దని స్పష్టం చేశారు.