బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ప్రకటించిన కేంద్రం
- ఈ నెల 29న కేంద్ర బడ్జెట్ సమావేశాలు
- ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం
- ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
- క్వశ్చన్ అవర్ నిర్వహించే అవకాశం
- త్వరలోనే నిర్ణయం
కరోనా కారణంగా గతేడాది పార్లమెంటు సమావేశాలు పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు సైతం కరోనా బారినపడడంతో వర్షాకాల సమావేశాలను బాగా కుదించారు. శీతాకాల సమావేశాలను కూడా నిర్వహించలేదు. కాగా, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ నిర్వహణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. గత సమావేశాల్లో సమయాభావం కారణంగా క్వశ్చన్ అవర్ నిర్వహించలేదు.