బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్న వాణీ విశ్వనాథ్, ప్రియారామన్!
- చెన్నైలో భేటీ అయిన బీజేపీ ఏపీ కార్యాలయ బాధ్యుడు సత్యమూర్తి
- జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఇస్తామని హామీ
- సోము వీర్రాజుతో చర్చించిన అనంతరం అధికారికంగా పార్టీలోకి
ప్రజాకర్షణ కలిగిన నేతలు, సినీ తారలను ఆహ్వానించడం ద్వారా పార్టీకి అదనపు ఆకర్షణ తీసుకురావాలని యోచిస్తోంది. నిన్న తమిళనాడు రాజధాని చెన్నైలో సీనియర్ మహిళా నటులు వాణీవిశ్వనాథ్, ప్రియారామన్లతో వేర్వేరుగా భేటీ అయిన బీజేపీ ఏపీ కార్యాలయ బాధ్యుడు సత్యమూర్తి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతానికి సహకరిస్తే 2024 ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని, అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో జరగనున్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనాలని కోరారు. ఇందుకు వారు ఓకే అన్నట్టు సమాచారం. బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుతో చర్చించిన అనంతరం వాణీ విశ్వనాథ్, ప్రియారామన్లు అధికారికంగా బీజేపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.