UK: యూకేకి విమాన ప్రయాణాలపై కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం

flights between India and UK will resume from 8th January
  • జనవరి 8 నుంచి విమాన సర్వీసులు పునఃప్రారంభం
  • 23 వరకు వారానికి 15 ఫ్లైట్స్ కి అనుమతి
  • ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి మాత్రమే రాకపోకలు
కరోనా కొత్త స్ట్రెయిన్ కారణంగా యూకే నుంచి రాకపోకలను పలు దేశాలు నిషేధించిన సంగతి తెలిసిందే. భారత్ కూడా యూకే నుంచి విమాన రాకపోకలపై బ్యాన్ విధించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 8 నుంచి యూకే, ఇండియాల మధ్య విమాన రాకపోకలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని భారత పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. అయితే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి మాత్రమే రాకపోకలు ఉంటాయని చెప్పారు. జనవరి 23 వరకు వారానికి 15 ఫ్లైట్స్ ను మాత్రమే అనుమతించనున్నారు.
UK
Britain
Fights
India

More Telugu News