Telangana: న్యూఇయర్ వేడుకలను ఎందుకు నిషేధించలేదు?: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

  • కొత్త కరోనా ప్రమాదకరమని హెల్త్ డైరెక్టర్ చెపుతున్నారు
  • అయినా వేడుకలను ఎలా అనుమతించారు
  • వైన్ షాపులు, బార్లు తెరవడం ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు?
High Court serious on Telangana govt for not banning New Year celebrations

కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు హైదరాబాద్ ప్రజలు రెడీ అయిపోతున్నారు. మరోవైపు అర్ధ రాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు  తెరిచే ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. న్యూఇయర్ వేడుకలను బ్యాన్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త కరోనా వైరస్ ప్రమాదకరమని ఓ వైపు హెల్త్ డైరెక్టర్ చెపుతుంటే... వేడుకలను ఎలా అనుమతిస్తారని మండిపడింది.

విచ్చలవిడిగా వైన్ షాపులు, బార్లు తెరవడం ద్వారా ఏం చేయాలనుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకుని హైకోర్టు ఈ అంశంపై విచారణ జరిపింది. వేడుకలను బయట జరుపుకోవద్దని ప్రజలకు సూచించామని ఈ సందర్భంగా కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. దీంతో, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది. జనవరి 7న పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వేడుకలను నిషేధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది.

More Telugu News