కరోనాతో బాధపడుతున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.. అత్యవసరంగా ఆసుపత్రికి తరలింపు
- ఈ నెల 18న కరోనా బారినపడిన త్రివేంద్రసింగ్ రావత్
- ఆరోగ్యం నిలకడగా ఉందన్న అధికారులు
- ముందు జాగ్రత్తగానే ఆసుపత్రికి తరలించినట్టు వివరణ
ప్రస్తుతం ఆయన జ్వరం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్టు డూన్ ఆసుపత్రిలో కొవిడ్-19 నోడల్ అధికారి డాక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.