అంతర్వేది లక్ష్మీనరసింహుడి కొత్త రథం సిద్ధం.. నేడు ట్రయల్ రన్
- మూడు నెలల క్రితం కాలిబూడిదైన రథం
- మరో 15 రోజుల్లో రథానికి రంగులు
- భీష్మ ఏకాదశి నాడు రథోత్సవం
సెప్టెంబరులో అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవ రథం అగ్నికి ఆహుతైంది. ఆలయ ప్రాంగణంలోని షెడ్డులో భద్రపరిచిన రథానికి అర్ధరాత్రివేళ మంటలు అంటుకోవడంతో పూర్తిగా కాలి బూడిదైంది. 40 అడుగుల ఎత్తుండే ఈ రథాన్ని 60 ఏళ్ల క్రితం తయారు చేశారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహిస్తారు. రథం అగ్ని ప్రమాదానికి గురికావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. దీంతో స్వామి వారికి కొత్త రథ నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం మూడు నెలల్లోనే దానిని సిద్ధం చేసింది.