ఖమ్మంలో బీజేపీ నేత నేలవెళ్లి రామారావు దారుణ హత్య.. ఇంటికెళ్లి పొడిచి చంపిన దుండగుడు

Khammam BJP leader killed in wyra
  • నాలుగుసార్లు పొట్టలో పొడిచిన దుండగుడు 
  • రక్తపు మడుగులో కుప్పకూలిన రామారావు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
ఖమ్మంలో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. వైరాలోని పాత బస్టాండ్ ప్రాంతంలో నివసించే బీజేపీ నేత నేలవెళ్లి రామారావు ఇంటికి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై కత్తితో దాడిచేశాడు. ఆయన పొట్టలో నాలుగుసార్లు పొడిచినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

రక్తపు మడుగులో కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన రామారావును వెంటనే 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Khammam District
Wyra
BJP
Murder

More Telugu News