గౌతు లచ్చన్న విగ్రహం వద్ద నిరసనకు టీడీపీ పిలుపు.. శ్రీకాకుళంలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్
- సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామన్న మంత్రి
- టీడీపీ శ్రేణుల నిరసనకు అనుమతి లేదన్న పోలీసులు
- అయినా, నిర్వహించి తీరుతామన్న టీడీపీ నేతలు
నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ తాము కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష తేల్చిచెప్పారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కార్యక్రమానికి వెళ్లకుండా టీడీపీ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. నిమ్మాడలో టీడీపీ రాష్ట్ర అధినేత అచ్చెన్నాయుడు, శ్రీకాకుళంలో ఎంపీ రామ్మోహన్నాయుడు, నేతలు కూన రవికుమార్, సోంపేటలో గౌతు శ్యామసుందర శివాజీ, పలాస టీడీపీ కార్యాలయంలో గౌతు శిరీషలను పోలీసులు నిర్బంధించారు.