పోలింగ్ కేంద్రంలో సందడి చేసిన రోబో.. ఓటర్ల శరీర ఉష్ణోగ్రత చెక్ చేసి, శానిటైజర్ ఇచ్చిన వైనం!
- కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగంలోకి రోబో
- ప్రయోగాత్మకంగా సేవలు అందుబాటులోకి
- కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు
ఓటరు శరీర ఉష్ణోగ్రత అనుమానాస్పదంగా ఉంటే హెచ్చరించి పోలింగ్ అధికారిని సంప్రదించాల్సిందిగా సలహా ఇచ్చింది. అలాగే, ఫేస్మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించింది. పోలింగ్ కేంద్రంలో రోబో సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలించినట్టు ఎర్నాకుళం కలెక్టర్ ఎస్ సుహాస్ తెలిపారు. ఇతర పోలింగ్ కేంద్రాలలో కూడా వీటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.