డెంటిస్టును కలిసేందుకు నేడు ఢిల్లీకి కేసీఆర్.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ!
- రెండు మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న కేసీఆర్!
- కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఒత్తిడి
- అంతర్రాష్ట్ర నీటి వివాదాలను తేల్చాలని కోరనున్న సీఎం
అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టంలోని సెక్షన్ -3 ప్రకారం రాష్ట్రం చేసిన ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని, లేదంటే ట్రైబ్యునల్కు సిఫార్సు చేయాలన్న తమ అభ్యర్థనకు ఇప్పటి వరకు సమాధానం లేకపోవడంతో ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తారని నీటిపారుదల వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే, పంటి సమస్యతో బాధపడుతున్న కేసీఆర్ అక్కడ డెంటిస్టును కలుస్తారని, రెండు మూడు రోజులు ఢిల్లీలో ఉంటారని సమాచారం.