JP Nadda: దుర్గామాత దయ వల్ల బయటపడ్డాను: జేపీ నడ్డా

Durga Matha Grace helped me says JP Nadda
  • బుల్లెట్ ప్రూఫ్ కారులో ఉన్నందువల్ల ఏమీ కాలేదు
  • కాన్వాయ్ లోని ఒక్క కారును కూడా వదల్లేదు
  • బెంగాల్ లోని గూండారాజ్ ప్రభుత్వం అంతం కాబోతోంది
కోల్ కతాలోని డైమండ్ హార్బర్ లో బీజేపీ శ్రేణుల సమావేశానికి వెళ్తున్న సమయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇటుకలు, రాళ్లతో కాన్వాయ్ పై దాడి చేశారు. వాహనశ్రేణిలో ఉన్న పలు కార్లు డ్యామేజ్ అయ్యాయి. పలువురు బీజేపీ నేతలు గాయపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ ఈ దాడికి పాల్పడిందని బీజేపీ మండిపడింది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. దాడి జరిగిన తర్వాత జేపీ నడ్డా నేరుగా సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు.  

ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ, తాను సమావేశానికి చేరుకున్నానంటే... అది దుర్గామాత ఆశీర్వాదంవల్లేనని అన్నారు. ముకుల్ రాయ్, కైలాశ్ విజయవర్గీయులు దాడిలో గాయపడ్డారని చెప్పారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికే మచ్చ అని మండిపడ్డారు. తమ కాన్వాయ్ లో ఉన్న ఏ ఒక్క కారును కూడా వదల్లేదని చెప్పారు. తాను బుల్లెట్ ప్రూఫ్ కారులో ఉన్నందువల్ల తనకు ఏమీ కాలేదని అన్నారు. బెంగాల్ లోని గూండారాజ్ ప్రభుత్వం అంతం కాబోతోందని జోస్యం చెప్పారు.

ఈ సందర్భంగా విజయవర్గీయ తన మోచేతికి అయిన గాయాలను చూపించారు. పోలీసుల సమక్షంలోనే తమపై దుండగులు దాడులకు పాల్పడ్డారని చెప్పారు. దాడి జరుగుతున్న సమయంలో అసలు మనం మన దేశంలోనే ఉన్నామా? అని అనిపించిందని అన్నారు.
JP Nadda
BJP
Convoy
Attack

More Telugu News