GHMC Elections: గ్రేటర్ ఫైట్... పెన్నుతో టిక్ పెట్టినా ఓటేనన్న ఈసీ... హైకోర్టుకు బీజేపీ!

High Court to Hear EC Desission PenTick on Ballot
  • నేడు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు
  • హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ
  • మరికాసేపట్లో విచారించనున్న కోర్టు

నేడు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో, బ్యాలెట్ పేపర్ పై పెన్నుతో టిక్ పెట్టినా ఓటేసినట్టేనని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన సర్క్యులర్ తీవ్ర కలకలం రేపింది. ఈ విషయాన్ని ముందుగానే ప్రకటించలేదని ఆరోపిస్తూ, బీజేపీ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ ఉదయం హైకోర్టు తెరచుకోగానే దీనిపై విచారణ జరగనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. కాగా ఈసీ తాజా నిర్ణయం తరువాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లపై తమకు అనుమానాలు పెరుగుతున్నాయని బీజేపీ నేతలు అంటున్నారు.

  • Loading...

More Telugu News