ముంబయి మురికివాడల్లో ఆశ్చర్యకర రీతిలో కరోనా యాంటీబాడీల గుర్తింపు

Antibodies found in a Mumbai slum area people
  • సర్వే చేపట్టిన ఐబెట్స్, హర్షిత నర్వేకర్
  • 75 శాతం మందిలో యాంటీబాడీలు
  • అత్యధికుల్లో లక్షణాలు లేకుండానే కరోనా
కరోనా రోగులు కోలుకున్న తర్వాత వారిలో ఏర్పడే యాంటీబాడీల విషయమై ఇటీవలే ముంబయిలో ఓ సర్వే నిర్వహించారు. కఫే పరేడ్ ప్రాంతంలోని 5 మురికి వాడల్లో ఈ సర్వే నిర్వహించగా, అందులో వెల్లడైన ఫలితాలు పరిశోధకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. దాదాపు 75 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నాయట.

మొత్తం 806 మందిని పరీక్షించగా, వారిలో 605 మందిలో యాంటీబాడీలు గుర్తించారు. వీళ్లలో ఓ ఎనిమిది మంది మాత్రమే తమకు గతంలో కరోనా సోకిందన్న విషయాన్ని పంచుకున్నారు. చాలామందికి లక్షణాలు లేకుండానే కరోనా వచ్చి పోయుంటుందని భావిస్తున్నారు. ఇక, కొందరు వైరస్ బారినపడిన వారు ఆ విషయం వెల్లడించేందుకు ముందుకు రాలేదు. బీజేపీ కార్పొరేటర్ హర్షిత నర్వేకర్, ఐబెట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ సీరో ప్రివలెన్స్ సర్వే నిర్వహించగా ఈ మేరకు ఫలితాలు వెల్లడయ్యాయి.

 ముఖ్యంగా, 60 ఏళ్లకు పైబడిన వృద్ధుల్లో 76 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నాయట. అత్యధికుల్లో యాంటీబాడీలు ఉన్నా, మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి అని బీజేపీ కార్పొరేటర్ హర్షిత నర్వేకర్ పేర్కొన్నారు. గతంలో బీఎంసీ ఇలాంటిదే ఓ సీరో ప్రివలెన్స్ సర్వే నిర్వహించగా, ఓ మురికివాడలో 45 శాతం మందిలో యాంటీబాడీలు గుర్తించారు. యాంటీబాడీల రేటు పురుషుల్లో కంటే మహిళల్లోనే అత్యధికంగా ఉందని తాజాగా ఐబెట్స్, హర్షిత నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
Go Back to Shorts
Antibodies
Mumbai
seroprevalence
Corona Virus
Slum

More Telugu News