స్టోన్ క్రషర్ సంస్థకు దిమ్మదిరిగేలా జరిమానా విధించిన ఏపీ అధికారులు
- యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్న సంస్థ
- రెండు రోజుల క్రితమే రూ. 4.5 కోట్ల జరిమానా
- తాజాగా మరో రూ. 10 కోట్ల జరిమానా చెల్లించాలంటూ నోటీసులు
దీనిని తీవ్రంగా పరిగణించిన అధికారులు రూ.9.55 కోట్ల జరిమానా విధించారు. అలాగే, గ్రావెల్ తవ్వకాల్లో జరిగిన అక్రమాలకు గాను మరో రూ. 41.81 లక్షల జరిమానా విధించారు. పన్నులతో కలిపి మొత్తంగా రూ. 10 కోట్లను జరిమానాగా చెల్లించాలంటూ అంజని స్టోన్ క్రషర్కు నోటీసులు పంపారు. రెండు రోజుల క్రితం ఇదే సంస్థ వేరే సర్వే నంబరులో అక్రమంగా తవ్వకాలు జరిపినందుకు గాను అధికారులు రూ. 4.5 కోట్ల జరిమానా విధించారు. తాజాగా, మరో పది కోట్ల రూపాయలు జరిమానా విధించడం చర్చనీయాంశమైంది.