బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం
- డిసెంబరు 2న తీరాన్ని తాకుతుందని ఐఎండీ వెల్లడి
- దక్షిణ కోస్తా, రాయలసీమపైనా ప్రభావం
- ఉరుములు, మెరుపులతో వర్షాలు
దీని ప్రభావంతో డిసెంబరు 1, 2 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్, దక్షిణ కోస్తాంధ్ర, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో చెదురు మదురు వానలు కురుస్తాయని, అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది.