మేజర్ అయిన అమ్మాయి నచ్చిన వాడితో ఉండొచ్చు: ఢిల్లీ హైకోర్టు
- ప్రియుడితో కలిసి వెళ్లిపోయిన సులేఖ అనే యువతి
- నా ఇష్టం మేరకే ఇంటి నుంచి వచ్చేశానని కోర్టుకు తెలిపిన వైనం
- వారి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని కోర్టు ఆదేశం
దీంతో, అమ్మాయి జాడ కనిపెట్టాలని ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో అమ్మాయి జాడను ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెను కోర్టు విచారించింది. తన ఇష్ట ప్రకారమే బబ్లూను పెళ్లి చేసుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చానని ఆమె చెప్పింది. తాను మేజర్ నని తెలిపింది.
దీంతో, ఆమె కోరుకున్నవాడితో ఉండొచ్చని కోర్టు తెలిపింది. సులేఖ కుటుంబసభ్యులు వీరి విషయంలో జోక్యం చేసుకోరాదని... ఆమె సోదరుడికి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించింది. సులేఖ, బబ్లూకి వారు ఉంటున్న ప్రాంతంలోని బీట్ కానిస్టేబుల్ మొబైల్ ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచాలని చెప్పింది. వాళ్లకు ఎప్పుడు అవసరమైనా... వెంటనే పోలీసులు అందుబాటులో ఉండాలని ఆదేశించింది.