అయోధ్య ఎయిర్ పోర్టుకు 'మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విమానాశ్రయం'గా నామకరణం
- సాధువులు హర్షం
- రాముడి పేరు పెట్టాలని కొంత కాలంగా ప్రతిపాదన
- ఆమోదించిన యూపీ మంత్రి వర్గం
చివరకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దాన్ని ఆమోదించడం గమనార్హం. అయోధ్యలో విమానాశ్రయం నిర్మాణానికి ఇప్పటికే భూసేకరణ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కేంద్ర పౌరవిమానయాన శాఖ విమానాశ్రయ నిర్మాణ పనులు చేపట్టనుంది. అయోధ్యకు అంతర్జాతీయ, దేశీయ టెర్మినల్స్ రెండూ ఉంటాయని గతంలోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రకటించారు. కాగా, యూపీలో ఈ ఏడాది రైతులు చెల్లించే మండీ ఫీజును 2 శాతం నుంచి ఒక శాతానికి తగ్గిస్తూ కూడా యూపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.