ఏపీ నుంచి చెన్నైకి ఆర్టీసీ సర్వీసులు పునఃప్రారంభం
- 8 నెలల తర్వాత చెన్నైకి బస్సులు
- ఆన్ లైన్ లోనూ టికెట్లు
- డిమాండ్ కు అనుగుణంగా మరిన్ని బస్సులు
విజయవాడతో పాటు తిరుపతి, గూడూరు తదితర ప్రాంతాల నుంచి తమిళనాడుకు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. చెన్నైకి ఏపీ నుంచి మళ్లీ బస్సులు తిరగడం 8 నెలల తర్వాత ఇదే ప్రథమం. చెన్నై ప్రయాణం కోసం ఏపీఎస్ ఆర్టీసీ ఆన్ లైన్ లోనూ టికెట్లు ఉంచింది. రాబోయే రోజుల్లో డిమాండ్ కు అనుగుణంగా చెన్నైకి మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసి అధికారులు భావిస్తున్నారు.