నాదెండ్ల మనోహర్తో కలిసి ఢిల్లీ వెళ్లిన పవన్.. నేడు బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీ
- ఏపీ, తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ
- ఏపీ స్థానిక ఎన్నికలపై చర్చించే అవకాశం
- విజయశాంతిని కలిసే అవకాశం
ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధరన్ కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి నేడు బీజేపీలో చేరనున్నారు. పవన్ ఇప్పటికే ఢిల్లీ చేరుకోగా, విజయశాంతి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.