ప్రకాశం జిల్లాలో టీడీపీ మద్దతుదారులపై దుండగుల హత్యాయత్నం
- కాపుకాసి మరీ దాడి
- బాధితుల్లో ఒకరి భార్య టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి
- వైసీపీ పనేనన్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు కృష్ణయ్య భార్య రాఘవమ్మ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులే ఈ దాడికి తెగబడి ఉంటారని టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఆయన దాడులకు భయపడేది లేదన్నారు.