తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ రాకపోవచ్చు: ఈటల
- ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉంది
- రోజుకు 50 వేల కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నాం
- బడులు తెరవడంపై కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు
పాఠశాలలను ప్రారంభించడానికి ప్రైవేట్ యాజమాన్యాలన్నీ సిద్ధంగా ఉన్నాయని... ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని మంత్రిని ట్రస్మా ప్రతినిధులు కోరారు. దీనికి సమాధానంగా అందరూ కలసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలని వారికి మంత్రి సూచించారు. పాఠశాలలను మళ్లీ ప్రారంభించే విషయంలో సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అవసరమైన పక్షంలో స్కూళ్లలో కూడా కరోనా పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు.