Team India: హాట్ కేకుల్లా అమ్ముడైన టీమిండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ ల టికెట్లు

Team India tour in Australia tickets sold out
  • నవంబరు 27 నుంచి టీమిండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ లు
  • 5 మ్యాచ్ లకు టికెట్లు మొత్తం అమ్మకం
  • ఆసీస్ స్టేడియాల్లో 50 శాతం సీటింగ్ కు అనుమతి
సుదీర్ఘ పర్యటన కోసం విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియా తరలి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నెల 27 నుంచి ఆసీస్ గడ్డపై భారత జట్టు పర్యటన షురూ కానుంది. మొదట 3 వన్డేలు ఆడనున్న టీమిండియా తర్వాత 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో తలపడనుంది. అది ముగిసిన అనంతరం డిసెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ జరుగుతుంది. కాగా, ఈ రెండు జట్ల పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్ ల టికెట్లు నేడు అమ్మకానికి ఉంచగా తొలిరోజే అదిరిపోయే స్పందన వచ్చింది.

మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ ల టికెట్లను విక్రయానికి పెట్టగా, 5 మ్యాచ్ ల టికెట్లు తొలిరోజే అమ్ముడయ్యాయి. అభిమానులు పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలు చేయడంతో క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. కేవలం తొలి వన్డేకు సంబంధించి 2 వేల టికెట్లు మాత్రమే ప్రస్తుతం మిగిలున్నాయి. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆసీస్ స్టేడియాల్లో 50 శాతం సీటింగ్ నే అనుమతిస్తున్నారు. దాంతో టికెట్ల సంఖ్యను కూడా తగ్గించారు.
Team India
Australia
Tickets
Limited Over Series
Corona Virus

More Telugu News