Andhra Pradesh: ఏపీలో కొత్తగా 1,236 కరోనా కేసుల నమోదు

Andhra Pradesh registers 1236 cases in 24 hours
  • 24 గంటల్లో తొమ్మిది మంది మృతి
  • ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసులు 8,57,395
  • ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 16,516
ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా మరో 1,236 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో తొమ్మిది మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, అనంతపూర్ లో ఒక్కరు, తూర్పుగోదావరిలో ఒక్కరు, గుంటూరు జిల్లాలో ఒక్కరు మృతి చెందారు.

తాజా గణాంకాలతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,57,395కి చేరింది. మొత్తం మరణాలు 6,899కి చేరాయి. గత 24 గంటల్లో 69,618 మందికి కరోనా పరీక్షలను నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,516 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News